విలియమ్, కాటే మిడిల్టన్ దంపతులకు రెండో బిడ్డ
న్యూఢిల్లీ: కాటే మిడిల్టన్, ప్రిన్స్ విలియమ్ రెండో బిడ్డను కనబోతున్నారు. ప్యాలెస్ అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తమకు రెండో సంతానం కలుగబోతుందనే విషయాన్ని ప్రకటించడానికి కాటే మిడిల్టన్, ప్రిన్స్ విలియమ్ ఎంతగానో సంతోషిస్తున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ ప్రకటించింది.
క్లారెన్స్ హౌస్ ఆ విషయంపై ట్విట్టర్ ద్వారా కూడా తెలిపింది. ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఎంతో సంతోషిస్తున్నారని ట్వీట్ చేశారు. కాటె మిడిల్టన్ గర్భధారణ విషయంలో సమస్యలు వచ్చినట్లు పుకార్లు వెల్లువెత్తిన సమయంలో ఆమె గర్భధారణ గురించి ఇంతకు ముందు ప్రకటన చేశారు.
తొలి గర్భధారణ సమయంలో తలెత్తిన సమస్య నుంచి బయటపడడానికి మార్నింగ్ సిక్నెస్కు చికిత్స చేసినట్లు తెలిపారు. ప్రిన్స్ విలియమ్ గ్రాండ్ మదర్ కూడా ఆ వార్త పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆ దంపతులకు తొలి సంతానం కలిగి దాదాపు 14 నెలలు అవుతోంది.
తొలి సంతానం ప్రిన్స్ జార్జ్ దంపతుల వారసుడిగా ముందుకు వస్తారు. దంపతులపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. బ్రిటిష్ ప్రదాని డేవిడ్ కామెరోన్ ట్విట్టర్ ద్వారా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కాటే విలియమ్స్, విలియమ్ 2011 ఏప్రిల్లో వివాహ చేసుకున్నారు.