ఎయిర్ ఏషియాలో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత పైలెట్లు: రిపోర్ట్
సిడ్నీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్కు చెందిన ఉగ్రవాద ప్రేరేపిత ఇండోనేషియా పైలెట్లు విధుల్లో ఉన్నట్లు 'ఆపరేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్' పేరిట ఆస్టేలియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీరు ఇండోనేషియాకు చెందిన వారని, ఎయిర్ ఏషియాతో పాటు ప్రీమీ ఎయిర్ విమానయాన కంపెనీలో పని చేస్తున్నారని అనుమానిస్తున్నట్టు తెలిపింది.
ఐఎస్ఐఎస్కు చెందిన వీరు ప్రమాదకారులుగా ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో ఉగ్రవాద ప్రేరేపిత ఇండోనేషియా పైలెట్లను గుర్తించేందుకు విమానయాన సంస్ధల సహకారాన్ని ఫెడరల్ పోలీసులు కోరారు.
ఇది నిఘా, దేశ భద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి మరిన్ని విషయాలు వెల్లడించలేమని ఫెడరల్ పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే, ఎయిర్ ఆసియా సంస్ధ ఇండియాలో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే.
గత డిసెంబర్లో మలేషియాకు చెందిన విమానం ఎయిర్ ఏషియా క్యూజెడ్8501 జావా సముద్రంలో కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 162 మంది ప్రాణాలు మృత్యవాత పడ్డారు. రెండు నిమిషాల ఆలస్యం వల్లే విమానం కూలింది.