వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా తీవ్రవాద దాడి: స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడిపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని అభిప్రాయపడ్డారు. దాడిపై తమకు నివేదికలు అందాయని, తాను వాటిని పరిశీలించానని, అక్కడి పరిస్థితులు భయానకంగా ఉన్నాయని చెప్పారు. ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని చెప్పారు.

భారత్, పాకిస్తాన్‌లు కలిసి ముందుకు నడిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నెల 14వ తేదీన జైష్ ఎ మొహమ్మద్ ఉగ్రవాది దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా, అమెరికా అధ్యక్షుడు స్పందించారు.

Pulwama attack: Horrible situation, says US President Donald Trump

వైట్‌హౌస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ... దాడులపై భారతదేశంతో చర్చించామని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ దాడిపై విచారణకు పాకిస్థాన్‌ పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ దేశంతోనూ చర్చలు జరిపామని వెల్లడించారు.

అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ రాబర్డ్ పల్లాడినో ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భారత్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. అలాగే, పుల్వామా దాడి నిందితులను పాకిస్తాన్ కూడా శిక్షించాలని, ఈ మేరకు తాము అడుగుతామని చెప్పారు.

English summary
US President Donald Trump Tuesday described Pulwama terrorist attack by Jaish-e-Mohammed group as a horrible situation, in which 40 Indian paramilitary personnel were killed, and said he was getting reports on it and would issue a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X