Red sea: 16 ఏళ్ల బాలికపై క్యూలో 30 మంది గ్యాంగ్ రేప్ రేప్, ఎర్ర సముద్రంలో, ప్రధాని షాక్ !
జెరూసలేం/ అవివ్/ ఇజ్రాయెల్: ఎర్ర సముద్రంలో విహారయాత్రకు వెళ్లిన 16 ఏళ్ల బాలికను హోటల్ గదిలో నిర్బంధించి 30 మంది క్యూలో నిలబడి గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక స్పృహ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకున్న 30 మంది కామాంధులు వారి కామవాంఛ తీర్చుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ప్రధాన మంత్రి సైతం ఈ గ్యాంగ్ రేప్ పై విషాదం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దేశంలో అగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన వారిలో 13 మందిని అరెస్టు చేశామని పోలీసులు అంటున్నారు.
Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !
ఎర్ర సముద్రం చూడాలని కోరిక
ఇజ్రాయెల్ లోని ఈలాత్ సిటీలోని రెడ్ సీ (ఎర్ర సముద్రం) చూడటానికి రెండు వారాల క్రితం 16 ఏళ్ల బాలిక వెళ్లింది. అదే సమయంలో బాలిక మీద కామాంధులు కన్ను పడింది. తరువాత రెడ్ సీ రిసార్టులోని ఓ హోల్ లో ఆ బాలికను నిర్బంధించారు. బాలికపై లైంగిక దాడి చేసి కామం తీర్చుకోవాలని ప్రయత్నించిన కామాంధుల స్నేహితుల సంఖ్య గంటగంటకు పెరిగిపోయింది.
30 మంది క్యూలో గ్యాంగ్ రేప్
రెడ్ సీ రిసార్టు హోటల్ లోని గదిలో బాలికను నిర్భంధించిన కామాంధులు ఒకరి తరువాత ఒకరు క్యూలో వెళ్లి అత్యాచారం చేశారని వెలుగు చూసింది. బాలిక స్పృహ కోల్పోకుండా కామాంధులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకరి తరువాత ఒకరు 30 మంది బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసి చివరికి ఆమెను ప్రాణాలతో వదిలేశారు.
ఉలిక్కిపడిన ప్రధాని
హోటల్ నుంచి తప్పించుకుని ప్రాణాలతో భయటపడిన బాలిక జరిగిన విషయం స్థానిక పోలీసులకు చెప్పింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మీడియా వెలుగులోకి తీసుకురావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్ మిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం కాదు, మానవత్వానికి జరిగిన ద్రోహం. దోషులను కఠినంగా శిక్షిస్తాం, ఎవ్వరినీ వదిలిపెట్టమని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజ్ మిన్ నెతన్యాహు మనవి చేశారు.
Recommended Video
30 మంది కాదు 17 మందే ?
16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఇప్పటికే 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. తన మీద 30 మంది సామూహిక అత్యాచారం చేశారని బాలిక చెబుతోందని, పోలీసులు మాత్రం 17 మంది అత్యాచారం చేశారని చెబుతున్నారని ఇజ్రాయెల్ లోని పలు స్వచ్చంద సంస్థలు మండిపడుతున్నాయి. బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన 30 మందిని కాల్చిచంపాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ లో లక్షల మంది ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రెడ్ సీ హోటల్ లో జరిగిన సామూహిక అత్యాచారంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.