దారుణంగా మాట్లాడారు: మహిళా జర్నలిస్ట్తో ఫుట్బాల్ ఫ్యాన్స్ చిలిపిచేష్ట
ఇంగ్లాండ్: మాపిల్ లీఫ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ (ఎంఎల్ఎస్ఈ) నిర్వహించిన టోరంటో ఎఫ్సీ ఆటను చూసేందుకు స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. అయితే, మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు మహిళా విలేకరితో చిలిపి చేష్టలు ప్రదర్శించారు.
దీంతో వారిని ఆట చూడకుండా నిషేధం విధించారు. అభిమానులను సదరు మహిళా జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లారు. అప్పుడ వారు చిలిపి చేష్టలకు పాల్పడ్డారు.
వినేందుకు అసభ్యకరంగా అనిపించే మాటలు మాట్లాడారు. ఓ అభిమాని మరీ నీచంగా మాట్లాడారు. మహిళల పట్ల ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించగా.. ఇంగ్లాండులో ఇలాగే జరుగుతుందని చెప్పాడు. సుహానా హాంట్ అనే విలేకరు సిటీ ఛానల్ కవరేజ్ కోసం వెళ్లగా ఈ సంఘటన జరిగింది.
ఇందులో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంఎల్ఎస్ఈ ప్రకటించింది. వీరి వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవకరమని, వారు పోటీలను తిలకించడాన్ని నిషేధిస్తున్నామని, మహిళా జర్నలిస్టులకు మరింత సెక్యురిటీని పెంచుతామన్నారు.