అమెరికా శాంతి చిహ్నాలుగా సత్యార్ధి, మలాలా: అమెరికా సెనేట్ తీర్మానం
వాషింగ్టన్: బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న కైలాశ్ సత్యార్థి, మలాలా యూసుఫ్జాయ్లకు మరో అరుదైన గౌరవం దక్కనుంది. వీరిద్దరిని శాంతి చిహ్నాలుగా గుర్తించేందుకు ఆ దేశ సెనేట్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా భారతదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి ఇప్పటికే 82 వేల మంది బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారని సెనేట్ ఆ తీర్మానంలో పేర్కొంది. 11 ఏళ్ల చిన్న వయసు నుంచే మలాలా బాలికల విద్య కోసం కృషి చేసిందని వివరించారు. సెనేటర్ టామ్ హార్కిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మంగళవారం ఒస్లోలో సత్యార్థి, మలాలాలు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. నార్వే రాజధాని ఓస్లోలోని సిటీ హాల్లో బహుమతి ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఇద్దరి కుటుంబాలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.