ఇరాక్పై మరోసారి రాకెట్ దాడి, కిర్కుక్ ప్రావిన్స్లో అటాక్, ధృవీకరించిన అమెరికా, ఇరాక్
ఇరాక్ భూభాగంలో మరోసారి రాకెట్ దాడి జరిగింది. గురువారం రాత్రి కిర్కుక్ ప్రావిన్స్లో గల శిబిరంపై దాడి చేశారు. రాకెట్ దాడిని అమెరికా, ఇరాక్ భద్రతా వర్గాలు ధృవీకరించాయి. రాకెట్ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నాయి. దాడి చేసింది ఎవరనే అంశాన్ని మాత్రం ధృవీకరించలేదు.
డిసెంబర్ 27 తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి రాకెట్లతో దాడులు చేయడం. కే1 స్థావరం చేసిన దాడిలో అమెరికాకు చెందిన ఒక కాంట్రాక్టర్ చనిపోయిన సంగతి తెలిసిందే. 30 రాకెట్లతో బీభత్సం సృష్టించారు. దాడి చేసింది ఇరాన్కు సమీపంలో ఉన్న కటేట్ హిజ్బుల్లా అని అమెరికా అప్పట్లో ఆరోపించింది. అయితే తర్వాత అమెరికా ప్రతీకార దాడులు కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
తమ స్ధావరాలపై దాడి చేసిన కటేట్ హిజ్బుల్లాపై అమెరికా సేనలు దాడులు నిర్వహించాయి. అంతేకాదు ఇరాన్కు చెందిన ఖాసీం సొలైమానిని హతమార్చింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరిన సంగతి తెలిసిందే.