ఒక్కడ ఓ అమ్మాయి కోసం రైలు ప్రత్యేకంగా ఆగుతుంది
మాస్కో: 14 ఏళ్ళ బాలిక స్కూల్ చదువు కోసం తన గ్రాండ్ మదర్తో కలిసి మూడు గంటల దూరం ప్రయాణిస్తుంది. అయితే విద్యార్థిని ఇబ్బందులు గుర్తించిన సెయింట్ పీటర్స్బర్గ్-ముర్మాన్స్క్ రైలు మార్గంలో ఆమె కోసం రైల్వే అధికారులు ప్రత్యేకంగా స్టాప్ ఏర్పాటు చేశారు.
ఆ అమ్మాయి పోయకొండ నుంచి నటాలియా కోజ్లోవాకు స్కూల్ చదువు కోసం వెళ్తుంది. అమ్మాయి పేరు కరీనా కోజ్లోవా. ఈ గ్రామం నుంచి ఈ ఒక్క అమ్మాయే పాఠశాలకు వెళ్తుంది.
అక్కడ కొందరు రైల్వే సిబ్బందిని ఎక్కించుకునేందుకు రైలు ఆగుతుంది. దీని వల్ల ఆమె ఉదయం ఏడు గంటలకు ఇంట్లో నుంచి వచ్చి రాత్రి ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది. రోజు కిలోమీటరు దూరం నడిచి స్టేషన్లో ఏడున్నరకు రైలు ఎక్కుతుంది.
సాయంత్రం పోయకొండ వద్ద ఆగే రైలు కోసం అమ్మాయి వేచి ఉంటుంది. దీంతో ఇంటికి రావడం ఆలస్యమవుతోంది. ఆ తల్లి కూతురు కోసం రైల్వే అధికారులను అభ్యర్థించింది. దీంతో ఆ అమ్మాయి ఒక్క దాని కోసమైనా పోయకొండలో సాయంత్రం వెళ్లే రైలును ఆపాలని అధికారులు నిర్ణయించారు.