వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగుల జీతాలను నిలిపివేసిన శామ్‌సంగ్, 2009 తర్వాత ఇదే తొలిసారి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ తన ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. 2015లో దక్షిణ కొరియాకు చెందిన ఉద్యోగుల వేతనాలను నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరేళ్లలో ఉద్యోగుల జీతాలు నిలిపివేయడం ఇదే తొలిసారి. స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో లాభాలు తగ్గడంతో జీతాల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Samsung Electronics to freeze salaries in Korea for first time since 2009

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ప్రత్యర్ధులైన ఆపిల్ సంస్ధ కొత్త ఐఫోన్లు, జియోమి వంటి చైనా ఫోన్ల పోటీతో మార్కెట్‌లో శామ్‌సంగ్ షేరు బాగా పడిపోయింది. ఈ క్రమంలో శామ్‌సంగ్ సంస్ధ 2011 తర్వాత మొదటి సారిగా వార్షిక లాభాల్లో తక్కువ లాభాలను నమోదు చేసింది.

చివరిసారిగా 2009లో శామ్‌సంగ్ ఉద్యోగుల జీతాలను నిలిపివేశాక, కంపెనీ ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడ్డ తర్వాత జీతాలు పెంచుకుంటూ వచ్చింది. అయితే ఈ వార్తలపై శామ్‌సంగ్ ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు.

English summary
Samsung Electronics said on Thursday it will freeze its South Korean employees' wages in 2015 for the first time in six years, after the world's top smartphone maker suffered a fall in profits in the face of rising competition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X