గాల్వాన్ వ్యాలీ నుంచి వెనక్కి చైనా సైన్యం, ఇవిగో ఉపగ్రహ చిత్రాలు, జూన్ 28కి జూలై 6కి తేడా...
భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా దళాలు క్రమంగా వెనక్కి వెళుతున్నాయి. గత నెల 28వ తేదీన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉన్నట్టు శాటిలైట్ చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. కానీ ఈ నెల 6వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రాలలో మాత్రం పీఎల్ఏ ఆర్మీ జాడ కనిపించలేదు. ఆ చిత్రాలను 'ఇండియా టుడే' విడుదల చేశాయి. సైనికులే కాదు టెంట్లు, వాహనాలు, గుడారాలు కూడా పీపీ 14 వద్ద చైనా దళాలు తీసివేశాయి.
మాక్సర్ టెక్నాలజీస్ వరల్డ్ వ్యూ 3 ఉపగ్రహం చిత్రాలను ఇండియా టుడేతో పంచుకున్నది. గాల్వాన్ నది పొంగిపొర్లుతున్నందున ఇదివరకు పీపీ 14 రహదారులను చైనా పున:నిర్మించిన సంగతి తెలిసిందే. రోడ్లు పాడవడంతో రీ కన్ స్ట్రక్షన్ చేసింది. అయితే ప్రస్తుతం అలాంటి నిర్మాణాలు కూడా కనిపించడం లేదు. జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణ తర్వాత చైనా ఈ పాయింట్ వద్ద తన ఆర్మీని భారీగా మొహరించింది. గుడారాలు వేసి, వాహనాల్లో సైనికులను పంపించింది.