సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో భారతీయ కార్మికులపై జరుగుతున్న అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. పని చేసే దగ్గర పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఫిర్యాదు చేసిందనే నెపంతో ఓ భారతీయ మహిళ చేతులను నరికేశారు ఆ ఇంటి యజమాని.
తమిళనాడుకు చెందిన బాధిత మహిళను కస్తూరి మునిరథినమ్(50)గా గుర్తించారు. గత కొంత కాలంగా ఆమె సౌదీ అరేబియా రాజధాని నగరమైన రియాద్లోని ఓ ఇంట్లో సహాయకురాలి(పని మనిషి)గా పని చేస్తోంది.
సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యజమానుల చిత్రహింసలు భరించలేక వారి ఇంటి బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమె చేతులు నరికేశారు యజమాని.
Chopping
of
hand
of
Indian
lady
-
We
are
very
much
disturbed
over
the
brutal
manner
in
which
Indian
lady
has
been
treated
in
Saudi
Arabia.
—
Sushma
Swaraj
(@SushmaSwaraj)
October
9,
2015
కాగా, ఈ దారుణ ఘటనను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాము ఇలాంటి ఘటనలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఓ భారత మహిళను ఈ విధంగా చిత్రహింసలకు గురిచేయడం తమను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.
బాధితురాలితో భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని సుష్మా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, మూడు నెలల క్రితం సౌదీ వెళ్లిన బాధితురాలు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.