సౌదీ రాజసౌధం లక్ష్యంగా క్షిపణి దాడి! మా పనే అన్న హౌతీ రెబల్స్..
సౌదీ అరేబియా రాజసౌధం లక్ష్యంగా మంగళవారం సాయంత్రం క్షిపణి దాడి జరిగింది. రియాద్లోని అల్యమ్మా రాయల్ ప్యాలెస్పై ‘ది వల్కినో 2-హెచ్ బాలిస్టిక్’ మిసైల్ను ప్రయోగించారు.
రియాద్: సౌదీ అరేబియా రాజసౌధం లక్ష్యంగా మంగళవారం సాయంత్రం క్షిపణి దాడి జరిగింది. రియాద్లోని అల్యమ్మా రాయల్ ప్యాలెస్పై 'ది వల్కినో 2-హెచ్ బాలిస్టిక్' మిసైల్ను ప్రయోగించారు.
ప్రమాదాన్ని గుర్తించిన సౌదీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సకాలంలో స్పందించి క్షిపణిలక్ష్యాన్ని చేరుకోకముందే దానిని నిర్వీర్యం చేసింది. క్షిపణి దాడితో సౌదీ వివాదంలో కొత్త అధ్యాయం మొదలైందని హౌతీ రెబల్స్ ప్రకటించారు.
హఠాత్తుగా జరిగిన క్షిపణి దాడితో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజసౌధం సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. సౌదీ రాజు సల్మాన్ తరచూ ఇక్కడికి వస్తుంటారు.
ప్రతివారం ప్రభుత్వ అధికారులతో, విదేశీ అతిథులతో ఆయన ఇక్కడే సమావేశం అవుతుంటారు. ఈ నేపథ్యంలో రాజునే లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందని భావిస్తున్నారు. సౌదీపై క్షిపణి దాడి జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి.
ఈ దాడి ఘటనపై హౌతీ రెబల్స్ స్పందించారు. రెబల్స్ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ మాట్లాడుతూ 'మా క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచాం. ఇప్పుడు మా హస్తం సౌదీ ప్యాలెస్ వరకు చేరుకుంది. దేవుడు కరుణించాడు..' అని వ్యాఖ్యానించారు.