భయానకం: దొరికినవారిని దొరికినట్లు గొడ్డలితో నరికాడు
జర్మనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు నరికాడు. దీంతో భయానక వాతావరణం నెలకొంది.
జర్మనీ: జర్మనీలోని రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి దొరికినవారిని దొరికినట్లు గొడ్డలితో నరికాడు. రైల్వే స్టేషన్లోకి చొరబడి ఓ వ్యక్తి గొడ్డలితో రెచ్చిపోయాడు. అత్యంత రాక్షసంగా వ్యవహరించాదడు. ఈ దాడిలో దాదాపు ఏడుగురు గాయపడ్డారు. జర్మనీలోని డస్సెల్డార్ఫ్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
గతంలో కూడా ఇక్కడ ఇలాంటి దాడులు జరిగాయి. అలా దాడులు చేసినవారిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి యుగోస్లోవియాకు చెందిన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దాదాపు 36 ఏళ్ల వయస్సు గల ఆ వ్యక్తి మానసిక పరిస్థితి బాగా లేదని భావిస్తున్నారు.
రాత్రి 8.50 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్లోకి గొడ్డలితో ప్రవేశించి దాడి చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారిని చూసి అతను పెద్ద గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతను గాయపడ్డాడు.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతని మానసిక పరిస్థితి విచారించడానికి వీలు కల్పించడం లేదని, మానసికంగా తీవ్రంగా దెబ్బ తిన్నట్లు తమకు అర్థమైందని పోలీసులు అంటున్నారు. ఈ సంఘటనతో రైల్వే స్టేషన్ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. ఎక్కిడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రైల్వే స్టేషన్లో ఎక్కడ చూసినా రక్తం మరకలే కనిపించాయి.