ఫిజిక్స్ లో మగవారిపై లింగ వివక్ష ... షాకింగ్ లెక్చర్ ఇచ్చిన ఓ సైంటిస్ట్
ఫిజిక్స్ కనుగొంది, అభివృద్ధి చేసింది మగవారైనా వారిపైనే లింగ వివక్ష కొనసాగుతుందని జెనీవాలో ఓ శాస్త్రవేత్త లెక్చర్ ఇచ్చి మరి అందరినీ షాక్ కు గురి చేశారు. ప్రపంచమంతా మహిళలు ఎదుర్కొనే లింగ వివక్ష గురించి చర్చిస్తుంటే , ఆ శాస్త్రవేత్త మాత్రం పురుషులు ఎదుర్కొంటున్న లింగ వివక్ష గురించి లెక్చర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా భౌతిక శాస్త్రంలో మగవారిని మహిళల తొక్కేస్తున్నారంటూ, మహిళల తీరుతో మగవారికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆయన వాపోయారు.
అభినందన్
కు
పరమవీర
చక్ర
ఇవ్వండి
..
ప్రధాని
మోదీకి
తమిళనాడు
సీఎం
పళని
లేఖ
యూరప్ లోని ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సంస్థలో ఒక సెమినార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యున్నత శక్తి సిద్ధాంతం- జండర్ అన్న అంశంపై పీసా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త అలెస్సండ్రో స్ట్రుమియా గెస్ట్ ప్రొఫెసర్ హోదాలో 'సెర్న్' సెంటర్లో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని విన్నవారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు జండర్ పరమైన అంశాలతో భౌతిక శాస్త్రాన్ని ముడిపెట్టి ఆయన ప్రసంగించిన తీరు అక్కడున్న వారినందరిని ఇబ్బందికి గురి చేసింది.
ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులు
భౌతిక శాస్త్రాన్ని కనిపెట్టింది, అభివృద్ధి చేసింది మగవారైనా మగవారికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్న ఆయన మహిళలకు ఎందుకు అవకాశం ఇవ్వాలంటూ మాట్లాడిన తీరు, చిత్రాలు, కొన్ని మ్యాప్ లు, కొన్ని చార్టులు చూపిస్తూ ఆయన తన వాదనను వినిపించిన తీరుతో విస్మయం చెందారు.
సదరు శాస్త్రవేత్త తన ప్రసంగాన్ని వినిపించిన 'సెర్న్' సెంటర్ కు ఫాబివోలా జియానోటీ అనే మహిళా శాస్త్రవేత్త చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ఇక ఆమె ముందు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి నోటికొచ్చింది మాట్లాడిన సదరు శాస్త్రవేత్తను ఇంకెప్పుడూ వేదికలు ఎక్కించరాదనీ , గెస్ట్ ప్రొఫెసర్ హోదాను కూడా తొలగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మహిళల పట్ల ఉన్న అక్కసును, ఫిజిక్స్ లో మగ వారికి అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని చెప్పిన పురుషపుంగవ శాస్త్రవేత్త పెద్ద రగడ చేశాడు. చివరకు వేదికల మీద మాట్లాడే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు.