క్యాబేజీ కొనడానికి గ్రాసరీ స్టోర్ వెళ్లి, లాటరీలో రూ.1.5 కోట్ల జాక్పాట్ దక్కించుకుంది
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్లో ఓ మహిళ క్యాబేజీ కొనడానికి వెళ్తే ఆమెకు ఏకంగా 2,25,000 డాలర్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె అక్షరాలు రెండు వందల ఇరవై అయిదు వేల డాలర్ల జాక్ పాట్ కొట్టేసింది.
క్యాబేజీ కొనడానికి వెళ్లింది
ఆ మహిళ పేరు వానెస్సా వార్డ్. ఆమె తండ్రి ఇటీవల క్యాబేజీ తీసుకు రావాలని పంపించాడు. ఆమె గ్రోవటన్లోని ఓ ఫుడ్ మార్కెట్కు వెళ్లింది. అక్కడ ఆమె తన తండ్రి చెప్పిన క్యాబేజీ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలోనే అక్కడ ఆమె ఓ స్పిన్ స్క్రాచ్ టిక్కెట్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.
టిక్కెట్ తెరవగా జాక్పాట్
ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత టిక్కెట్ను స్క్రాచ్ చేసింది. టిక్కెట్ తెరవగానే తనకు తగిలిన జాక్పాట్ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ గేమ్స్ టాప్ బహుమతిని గెలుచుకున్నట్లు ఆమె గుర్తించింది.
మన రూపాయల్లో రూ.1.5 కోట్లు
ఈ టిక్కెట్ ద్వారా లక్ష డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఎంతైనా గెలుచుకునే వీలు ఉంది. ఈ లాటరీలో ఆమె ఏకంగా 2,25,000 డాలర్లు గెలుచుకుంది. ఇది మన రూపాయల్లో దాదాపు రూ.1.5 కోట్లు.
గతంలో మరో మహిళకు
వానెస్సా టెంపుల్ హిల్స్లో నివసిస్తారు. ఈ డబ్బుతో తన రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలా ప్లాన్ చేస్తానని ఆమె చెప్పారు. డిస్నీ వరల్డ్కు ప్లాన్ చేస్తోంది. లాటరీని దక్కించుకున్న మేరీలాండ్ వాసుల్లో వానెస్సా ఒక్కరే లేరు. గత జూలై నెలలో మరో మహిళ కూడా లాటరీలో జాక్పాట్ కొట్టింది.