వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ దేశం వెళ్లిపో: మాస్క్‌తో వచ్చి సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు

సియాటెల్‌లో ఓ సిక్కు వ్యక్తి పైన కాల్పులు జరిగాయి. అతను ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపే ముందు.. నీ దేశానికి నువ్వు వెళ్లిపో అని కాల్చిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సియాటెల్‌లో ఓ సిక్కు వ్యక్తి పైన కాల్పులు జరిగాయి. అతను ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపే ముందు.. నీ దేశానికి నువ్వు వెళ్లిపో అని కాల్చిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు.

అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్‌ కూచిభోట్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి.

america

39 ఏళ్ల బాధితుడు (సిక్కు వ్యక్తి) కెంట్‌లోని ఈస్ట్ హిల్స్‌లో తన వాహనంలో వెళ్తుండగా కాల్పులు జరిగాయి.

అతను వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చాడని కెంట్ పోలీసులకు బాధితుడు చెప్పారు. ఈ దేశం వదిలి వెళ్లాలని తనతో నిందితుడు చెప్పాడని, ఆ తర్వాత కాల్చాడని చెప్పారు.

నిందితుడు 6 అడుగుల పొడవు ఉన్నాడని, మాస్క్ ధరించాడని బాధితుడు పోలీసులకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు కెంట్ పోలీసులు ఎఫ్‌బీఐ సహకారం కోరారు.

ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. అతను ఆసుపత్రి నుంచి విడదలయ్యాడు.

రెంటాన్‌లోని సిక్కు కమ్యూనిటీ నేత జస్మీత్ సింగ్ మాట్లాడుతూ... బాధితుడు ఆందోళన చెందుతున్నాడని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనల పైన ఆందోళనగా ఉన్నట్లు తెలిపారు.

English summary
A Sikh man was shot at in Seattle after being told to go back to his own country. The Kent police are looking for the gunman who walked into the driveway and shot at the Sikh man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X