సరిహద్దులో ఉద్రిక్తత: సమాచారం లేదు కాదనీ.. చైనా హింట్
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ బీజింగ్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దోవల్తో సమావేశంపై చైనా హింట్ ఇచ్చింది.
బీజింగ్: భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితుల్లో ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ బీజింగ్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దోవల్తో సమావేశంపై చైనా హింట్ ఇచ్చింది.
చదవండి: మేడిన్ జర్మనీ పేరుతో భారత ఆయుధాల్లో చైనా నకిలీలు
బ్రిక్స్ ఎన్ఎస్ఎ మీట్ సందర్భంగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సిలర్ యాంగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశాలున్నట్టు చైనా సోమవారం సంకేతాలు ఇచ్చింది.
ద్వారాలు తెరిచే ఉన్నాయని..
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లు కాంగ్ మీడియాతో మాట్లాడారు. దోవల్, యాంగ్ మధ్య చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. అయితే ఇద్దరూ సమావేశం కానున్న విషయాన్ని ఆయన నేరుగా ధ్రువీకరించలేదు.
గతంలోను ఇలా సమావేశాలు
గతంలో జరిగిన బ్రిక్స్ ఎన్ఎస్ఏ సమావేశంలోనూ అధికారులు ద్వైపాక్షిక సమావేశాలు జరిపిన సందర్భాలున్నాయన్నారు.
సమాచారం లేదు కానీ..
ప్రస్తుతానికైతే సంబంధిత సమాచారం తన వద్ద లేదని, తమకు తెలిసినంత వరకూ గతంలో జరిగిన సమావేశాల్లో ఆతిథ్య దేశం ప్రతినిధుల బృందంతో ద్వైపాక్షిక సమావేశాలు ఏర్పాటు చేయడం, పరస్పర అభిప్రాయాలు పంచుకోవడం జరిగిందన్నారు.
త్వరలో బీజింగ్కు దోవల్
బీజింగ్లో ఈ నెల 27-28 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దోవల్ ఈ వారంలో వెళ్తున్నారు. సరిహద్దు సమస్యలపై ధోవల్, యాంగ్లు ప్రత్యేక ప్రతినిధులుగా ఉన్నారు.