సింగపూర్: రహస్యంగా స్నేహితుడిని కలిసిందన్న కారణంతో కరోనా సోకిన మహిళకు జైలు శిక్ష
తన స్నేహితుడిని పలుమార్లు కలిసి మాట్లాడిన విషయాన్ని దాచిపెట్టడంతో సింగపూర్లో కోవిడ్ సోకిన ఒక మహిళకు 5 నెలల జైలు శిక్ష విధించారు.
65 ఏళ్ల 'ఓహ్ బీ హియోక్’ తన స్నేహితుడైన 72 ఏళ్ల లిం కియాంగ్ హాంగ్ను తరచు రహస్యంగా కలుసుకుంటూ ఉండేవారు.
తమ స్నేహాన్ని వివాహేతర సంబంధంగా భావించి అపార్థం చేసుకుంటారనే భయంతో ఓహ్ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టారు.
గత ఫిబ్రవరిలో ఓహ్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను కలుసుకున్నవారి జాబితాను కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా అధికారులు తీయడంతో ఈ విషయం బయటపడింది.
వీరిద్దరూ కలుసుకుంటున్నట్లు సీసీ టీవీలు, ఇతర ఆధారాల ద్వారా అధికారులు కనిపెట్టారు.
సింగపూర్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఆ దేశంలో ఇప్పటివరకూ 29 కరోనా మరణాలు సంభవించాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి.
ఫిబ్రవరిలో ఓహ్కు కోవిడ్- 19 నిర్ధరణ కాకముందు లింను ఐదుసార్లు కలిశారని తెలిసింది.
ఓహ్ భర్త బ్యాడ్మింటన్ ఆడడానికి బయటకు వెళ్లినప్పుడు వీళ్లిద్దరూ లంచ్, డిన్నర్ లేదా టీ తాగడానికి కలిసేవారని ఈ కేసులో న్యాయవాదిని ఉటంకిస్తూ స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
"తామిద్దరం తరచూ కలుసుకుంటున్నట్లు తన కుటుంబానికిగానీ, లిం కుటుంబానికిగానీ తెలియకూడదని ఓహ్ భావించారు. వారి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుని, వివాహేతర సంబంధం అంటగట్టి వదంతులు సృష్టించే అవకాశం ఉందని ఓహ్ భయపడ్డారని" కోర్టు డాక్యుమెంట్లలో రాశారు.
- కరోనావైరస్: భోపాల్లో చెప్పకుండానే మనుషులపై కరోనా వ్యాక్సీన్ ట్రయల్స్...
- కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్పై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి? భారత్ బయోటెక్ ఏమంటోంది?
ఓహ్ కోవిడ్తో ఆస్పత్రిలో చేరిన తరువాత 'లిం’కు ఫోన్ చేసి వారిద్దరూ కలుసుకుంటున్న విషయాన్ని రహస్యంగా ఉంచమని అడిగారు.
మార్చిలో లింకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణైంది.
అయితే ఓహ్ ద్వారా లింకు వైరస్ సంక్రమించలేదని ఓహ్ తరపు లాయరు తెలిపారు.
కార్ పార్కింగ్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఓహ్, లిం తరచూ కలుసుకుంటున్నట్లు అధికారులు కనిపెట్టారు.
శుక్రవారం కోర్టులో జరిగిన విచారణలో.."కోవిడ్ సమయంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఓహ్ ఉద్దేశాలు స్వార్థపూరితమైనవని" జడ్జ్ పేర్కొన్నారని బ్రాడ్కాస్టర్ సీఎన్ఏ తెలిపినట్లుగా ఏఎఫ్పీ వార్తా సంస్థ ప్రచురించింది.
అంతే కాకుండా, కాంటాక్ట్ ట్రేసర్స్నుంచీ సమాచారాన్ని దాచి పెట్టడం "ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదనే" సందేశాన్ని కోర్టు ప్రజలకు అందించవలసిన అవసరం ఉందని జడ్జ్ స్పష్టం చేశారు.
కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రయత్నాలను అడ్డుకున్నట్లుగా ఓహ్ నేరాన్ని అంగీకరించారు.
2020 మార్చి-మే నెలల్లో కరోనావైరస్ వ్యాప్తిని సింగపూర్ చాలావరకు కట్టడి చేయగలిగింది. తరువాత, వలస కార్మికుల వసతి గృహాలలో కోవిడ్ అధికంగా వ్యాప్తి చెందడంతో పాజిటివ్ కేసులు పెరగడం మొదలైంది. ఇప్పటివరకూ సింగపూర్లో 60,000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- పశ్చిమ బెంగాల్ ముస్లింలు మమతను వదిలి... ఒవైసీ వైపు నిలుస్తారా
- ప్రతిరోజూ స్నానం చేయడం, చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడటం ఎంత వరకు అవసరం?'
- అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్లో నిజం కాబోతోందా
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్పై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)