సిగరెట్ తాగి డస్ట్బిన్లో పడవేయనందుకు లక్ష ఫైన్ ....!
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హనికరం అంటూ బోర్డులు, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నిషేధం..ఒకవేళ తాగితే 500ఫైన్ అనే బోర్డులు మాత్రం చస్తాం కాని వాటిని అమలు పరిచే వ్యవస్థలు ఉండడం చాల కష్టం.అలా అని అధికారులు అక్కడడక్కడ బోర్డుల పెట్టి చేతులు దులుపుకుంటారు.కాని యూకేలో మాత్రం ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై లక్షలాదీ రూపాయాల జరిమానాలు వేస్తున్నారు.ఇక అధికారులు వేసిన జరిమానాలను కోర్టులు సైతం సమర్ధిస్తున్నాయి.
యూకేలోని ఓ రైల్వే స్టేషన్లో జాన్ విల్సన్ అనే వ్యక్తి సిగరెట్ తాగి పక్కనే ఉన్న డస్ట్బిన్ లో వేయకుండా కాలుకింద నలిపి వేశాడు. దీంతో ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది జాన్ విల్సన్కు ముందుగా 7వేల రుపాయల జరిమాన విధించింది. అయితే అధికారులు వేసింది కట్టకుండా జాన్ విల్సన్ ట్రిబ్యునల్ కు వెళ్లాడు .దాంతో ట్రిబ్యున్ సైతం అధికారులతో ఏకిభవించి 25 వేలు ఫైన్ గా విధించింది.
దీంతో చేసేదేమీ లేక జాన్ విల్సన్ కాంటేన్ బర్రీ కోర్టుకు వెళ్లాడు. ఇక అక్కడ కూడ విల్సన్ విచిత్రమైన తీర్పువెలువడింది. కోర్టు జాన్ విల్సన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో 25వేలకుగా ప్రభుత్వ ఖర్చుల క్రింద మరో 90 వేల రుపాయాలు కలిపి మొత్తం లక్ష 15వేల రుపాయనలు జరిమాన విధించింది. కాగా జాన్ విల్సన్ నిరుద్యోగి కావడంతో ఆయనకు జరిమానను చెల్లించేందుకు 18నెలల గడువు ఇచ్చింది కోర్టు