వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీవ్రవాద దాడి: సోమాలియాలో భారీ బాంబు పేలుడు, 230 మంది మృతి
సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.
మొగదిషు: సోమాలియాలో శనివారం ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 230 మంది మృతి చెందారు. 275 మందికిపైగా గాయపడ్డారు.
రాజధాని మొగదిషులోని ఓ హోటల్ లక్ష్యంగా ముష్కరులు ట్రక్ బాంబుతో దాడికి పాల్పడ్డారు. తర్వాత కాల్పులు జరిపారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతమంతా బీభత్సంగా మారింది.
పేలుడు ధాటికి దూరంలో ఉన్న భవనం కిటికీ అద్దాలు సైతం పగిలిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సోమాలియాకు చెందిన అల్షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తొలుత 189 మంది చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత మృతుల సంఖ్య 230కు పెరిగింది.
Comments
English summary
A truck bomb exploded outside a hotel at a busy junction in Somalia's capital Mogadishu on Saturday causing widespread devastation that left at least 189 dead, with the toll likely to rise.
Story first published: Sunday, October 15, 2017, 22:40 [IST]