వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశాధ్యక్షుడు చనిపోతాడంటూ జోస్యం.. పోలీసుల అదుపులో జ్యోతిష్కుడు

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ తప్పుడు ప్రచారం చేసిన జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ తప్పుడు ప్రచారం చేసిన జ్యోతిష్కుడు విజిత రోహన విజేమునిని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 27 లోపు అనారోగ్యంతోకానీ, ప్రమాదంలోకానీ సిరిసేన చనిపోతారంటూ సదరు జ్యోతిష్కుడు ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

శ్రీలంక వాసులు జ్యోతిష్యాన్ని బాగా నమ్యుతుంటారు. ప్రస్తుతం జ్యోతిష్కుడి అవతారం ఎత్తిన విజేముని ఇంతకుమునుపు నేవీలో పని చేసేవాడు. 1989లో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీలంకకు వచ్చినప్పుడు ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నించిన నేరానికి శిక్ష కూడా అనుభవించాడు.

 Sri Lanka: Astrologer who predicted president’s death arrested

ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ సామాజిక మాధ్యమాలలో విజేముని వీడియోలు పెడుతుండడంతో ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఇతడి కారణంగా ఏదో ఒక సమస్య తలెత్తుతుందని భావించిన మీడియా శాఖ సెక్రటరీ నిమల్ బోపేజ్.. విజేముని గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టమని గత డిసెంబర్ లోనే పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం విజేమునిని అరెస్టు చేశారు.

English summary
Sri Lanka police have arrested an astrologer who predicted President Maithripala Sirisena would die.Most Sri Lankans follow advises of astrologers for making decisions, and the suspect, astrologer Vijitha Rohana Wijemuni, is a former navy sailor convicted of attempting to assassinate India’s then-Prime Minister Rajiv Gandhi by assaulting him when he visited the island in 1989.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X