స్టిక్కర్ ఉంటే చాలు... వైర్ లేకుండానే మొబైల్ చార్జింగ్
ఎనర్జీ స్క్వేర్ అనే ఫ్రెంచ్ స్టార్టప్ ఒక కొత్త జనరేషన్ వైర్ లెస్ చార్జర్ ను అభివృద్ధి పరిచింది.
వాషింగ్టన్: ఇకమీదట వైర్ లేకుండానే మీ మొబైల్ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఎనర్జీ స్క్వేర్ అనే ఫ్రెంచ్ స్టార్టప్ ఒక కొత్త జనరేషన్ వైర్ లెస్ చార్జర్ ను అభివృద్ధి పరిచింది. ఈ కంపెనీ తయారు చేసిన అల్ట్రా థిన్ స్టిక్కర్లతో ఏకకాలంలో మీ మొబైల్స్ ను చార్జ్ చేసుకోవచ్చు.
దీనికోసం చార్జింగ్ ప్యాడ్, స్టిక్కర్ తో కూడిన ఈ టూ-పార్టీ సిస్టం ను మీ మొబైల్ వెనుక అమర్చుకోవలసి ఉంటుంది. ఈ స్టిక్కర్ మీద రెండు చిన్నన లోహపు దాట్స్ ఉంటాయి. దీంతోపాటు కనెక్టర్ కూడా ఉంటుంది.
ఈ కనెక్టర్ మీకు చార్జింగ్ ప్లగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. మీ మొబైల్ ను ప్యాడ్ మీద పెట్ట్టగానే చార్జింగ్ అవడం మొదలవుతుంది. ఈ వైర్ లెస్ చార్జర్ ఈ ఏడాది ప్రారంభంలోనే మార్కెట్ లోకి రానున్నట్లు ఎనర్జీ స్క్వేర్ కంపెనీ ప్రకటించింది.
వైర్ లేకుండానే రూపొందించిన ఈ కొత్త జనరేషన్ చార్జర్ గురించి ఈ కంపెనీ గత మే నెలలోనే ప్రముఖ కిక్ స్టార్టర్ వెబ్ సైట్ లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ చార్జర్ ను రేపటి నుంచి అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎనర్జీ స్క్వేర్ ప్రదర్శించనుంది.