ఆత్మాహుతి దాడులు: 32 మంది బలి
కామెరూన్: నైజీరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నైజీరియా సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మద్యాహ్నం ఉత్తర కామెరూన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు బోడో సెంట్రల్ మార్క్ ట్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు కామెరూన్ నగరంలోకి ప్రవేశించే ద్వారం వద్ద తమను తాము పేల్చుకున్నారు.
బోకో హారమ్ ఉగ్రవాదులే ఆత్మాహుతి దాడులకు పాల్పడి ఉంటారని నైజీరియా సైనిక అధికారులు తెలిపారు. నైజీరియాలో బోరో హారామ్ ఉగ్రవాదులు నిత్యం రెచ్చిపోతున్నారని సైనిక అధికారులు చెప్పారు.
ఈ ఆత్మాహుతి దాడుల్లో 32 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, 86 మందికి తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నారని సైనిక అధికారులు చెప్పారు. బోరో హారమ్ ఉగ్రవాదులను అంతం చేస్తామని సైనికులు అంటున్నారు.