మొదటి పేలుళ్లలో బయటపడేసిన విధి, రెండవ పేలుళ్లలో వక్రికరించింది,
బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు వెళ్లిన హోటల్లో బాంబుపేలుడు నుండి తప్పించుకున్న బ్రిటీష్ కు చెందిన అన్నా, చెల్లెల్లు, భయంతో పారిపోయారు. అయితే అక్కడి నుండి మరో హోటల్ లో తలదాచుకునేందుకు వెళ్లిన వారు మాత్రం రెండో సారి బాంబు పేలుడుతో మృత్యువు నుండి తప్పించుకోలేదు.
శ్రీలంక పేలుళ్లలో విషాద సంఘటనలు ,
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల మృతుల గాధాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కొద్ది నిమిషాల క్రితమే తమ ముందు మెదిలి అంతలోపే మృత్యువాత పడిన వారు కొందరైతే, అదృష్టవశాత్తు మృత్యువు నుండి బయటపడినవారు మరికొందరు, తమ కుటుంభ సభ్యులను మొత్తం కోల్పోయిన వారు ఉండగా ., ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలు మృత్యువాత పడి తల్లిదండ్రులు బయట పడిన ఘటనలు ఉన్నాయి. అయితే చావునుండి బయట పడ్డాం అనుకునే లోపే, మరో బాంబు రూపంలో మృత్యువు కబలించిన సంఘటన విషాదాన్ని నింపింది.
మొదటి బాంబు పేలుడు నుండి బతికి బయటపడ్డ అన్నా, చెల్లెలు
ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో ఒకే కుటుంభానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. దురదృష్టం ఏమిటంటే ఇద్దరు తోబుట్టువులు కూడ ఒక పేలుడును తప్పించుకుని, మరో పేలుడు లో మృత్యువాతపడ్డారు. బ్రిటన్ కు చెందిన డేనియల్ ఆయన సోదరి అమీలీ తమ తల్లితండ్రులతో కలిసి విహరయాత్రకు వెళ్లారు. అయితే పేలుళ్ల జరిగిన రోజు వారు విహర యాత్ర ముగించుకుని తిరిగి స్వస్థలానికి వెళ్లాల్సి న సమయంలో వారి కుటుంభం స్థానిక టేబుల్ వన్ కెఫేలో తింటుండగా బాంబు పేలుడు సంభవించింది. అయితే అదృష్టవశాత్తు వారు ఆ ఘటన నుండి బయటపడ్డారు.
మృత్యువు నీ వెంటే ఉన్నానంటూ తలదాచుకున్న హోటల్లో మరోపేలుడు,
ఇక షాక్ నుండే దగ్గరలోని కొలంబోలోని సాంఘ్రీలా హోటల్ కు వెళ్లారు. అక్కడ కూడ మరో పేలుడు జరగడంతో డేనియల్ తోపాటు ఆయన చెల్లేలు అమీలీ గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కాగా ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 310 కి చేరింది.