ఇండోనేషియా విమాన శకలాలు గుర్తింపు..? సముద్రంలో ఆనవాళ్లు.. ధృవీకరించని అధికారులు
ఇండోనేషియాకు చెందిన శ్రీ విజయ విమానం సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది. జకార్తా నుంచి 62 మంది ప్రయాణికులతో బయల్దేరిన కాసేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానం శకలాలు జకార్తా వెలుపల గల సముద్రంలో కనిపించినట్టు సహాయ చర్యలు చేపడుతున్న అధికారులు వివరించారు. పొంటియనిక్ ప్రాంతానికి బయల్దేరిన విమానం మధ్యాహ్నం 2.30 గంటలకు రాడార్తో సంబంధాలు తెగిపోయాయి.
Recommended Video
విమానంలో 62 మంది ఉన్నారని.. వారిలో 12 మంది విమాన సిబ్బంది అని రవాణాశాఖ మంత్రి బుడి కర్యా తెలిపారు. జకార్తా ఉత్తరాన గల సముద్రంలో ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రేడియో సిగ్నల్ కనుగోలేమని రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి బగాస్ పురుహితో వివరించారు. అయితే విమానానికి సంబంధించి శిథిలాలు సముద్రంలో ఉన్నాయని.. అయితే అదీ శ్రీ విజయ ప్లైట్కు సంబంధించో కాదో ధృవీకరించాల్సి ఉందన్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాల తర్వాత ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తోంది. నిమిషం వ్యవధిలో 10 వేల అడుగుల ఎత్తు తగ్గిపోయిందని వివరించారు. అయితే ఇండోనేషియా మీడియా మాత్రం అనుమానాస్పద శిథిలాలకు సంబంధించి ఫోటోలను చూపిస్తున్నాయి. కానీ దానిని ధృవీకరించాల్సి ఉంది. నీటిపై కేబుల్స్, జీన్స్, లోహపు ముక్కలు తేలినట్టు గుర్తించామని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. లోహపు ముక్కలు కనిపించాయని స్థానిక మత్య్సకారుడు తెలిపారు.