ఘోరం: రసాయనిక దాడి.. 58 మంది మృతి, మృతుల్లో 9 మంది చిన్నారులు
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో జరిగిన రసాయనిక దాడిలో 58 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు.
ఇడ్లిబ్: సిరియాలో రసాయనిక దాడి జరిగింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రసాయనిక దాడిలో సుమారు 58 మంది మృతి చెందారు.
ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. సిరియా దళాలు లేదా రష్యా జెట్ విమానాలు ఈ రసాయనిక దాడులకు పాల్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో 200 మంది ఈ దాడి ప్రభావానికి లోనయ్యారు.
.@GissiSim @NorthernStork @AsaadHannaa @Mr_Ghostly @Sophiemcneill @i24NEWS_EN PHOTOS: More images to show the scale of the chemical attack in Khan Sheikhan, #Idlib - @Mr_Ghostly pic.twitter.com/b2QCPeDdNu
— Conflict News (@Conflicts) April 4, 2017
తాము కెమికల్ వెపన్స్ వాడటం లేదని సిరియా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 2014 నుంచి 2015 మధ్య అసద్ సేనలు కనీసం మూడుసార్లు ఇలా రసాయనిక దాడులకు పాల్పడినట్లు ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
.@GissiSim @NorthernStork @AsaadHannaa @Mr_Ghostly VIDEO: Multiple people dead after the chemical attack on Khan Sheikhan, many of them children - @Sophiemcneill pic.twitter.com/MNvWJCk60N
— Conflict News (@Conflicts) April 4, 2017
సల్ఫర్ ఏజెంట్ తో దాడి చేసి ఉంటారని, శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.