తాలిబన్ సుప్రీం ముల్లా అక్తర్ మన్సూర్ హతం
కాబూల్: తాలిబన్ల అంతర్గత తగాదాలతో తాలిబన్ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రత్యర్థుల చేతిలో అంతం కావలసిన ముల్లా అక్తర్ మన్సూర్ సొంత మనుషులు జరిపిన కాల్పులలో హతం అయ్యాడు.
ఇంతకు ముందు తాలిబన్ చీఫ్ గా ముల్లా ఒమర్ ఉన్నాడు. అతని మరణంతో తాలిబన్ల కమాండర్ల మద్య గ్రూపు రాజకీయాలు తలెత్తాయి. ఎవరు తాలిబన్ చీఫ్ గా ఉండాలి అనే వాదనలు మొదలైనాయి. తాలిబన్లు రెండు వర్గాలుగా విడిపోయారు
అయితే గత జులై నెలలో తాలిబన్ చీఫ్ గా ముల్లా అక్తర్ మన్సూర్ ను నియమించారు. అప్పటి నుంచి ఓ వర్గం వారు ఆయన మీద గుర్రుగా ఉన్నారు. గ్రూపు రాజకీయాలు ముదిరిపోయాయి. మళ్లి రెండు వర్గాలుగా విడిపోయారు.
తాలిబన్ కమాండర్ల మద్య వివాదం ముదరడంతో పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నారు. గత బుధవారం జరిగిన కాల్పులలో ముల్లా అక్తర్ అన్సూర్ కు తీవ్రగాయాలైనాయి. చికిత్స విఫలమై శుక్రవారం ముల్లా అక్తర్ మన్సూర్ మరణించాడు.
2001లో తాలిబన్ పాలనలో ముల్లా అక్తర్ మన్సూర్ విమానాయాన శాఖ మంత్రిగా పని చేశాడు. అఫ్ఘనిస్థాన్ తో శాంతి చర్చలు జరపడానికి ముల్లా అక్తర్ మన్సూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారని, అందు వలనే ముల్లా అక్తర్ మన్సూర్ ప్రాణాలు పోయాయని ఆఫ్ఘనిస్థాన్ అధికారులు తెలిపారు.