వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేట్రోల్ ట్యాంకర్ పేలీ 50 మందికి పైగా దుర్మరణం

|
Google Oneindia TeluguNews

ఆఫ్రికా దేశంలోని నైజర్‌లో పేట్రోల్ ట్యాంకర్ పేలి సుమారు 55మందికి పైగా మృత్యువాత పడ్డట్టు నైజర్ మంత్రిత్వశాఖ అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ఘటనలో మరో 35 మంది వరకు తీవ్రగాయల పాలయ్యారని వారు తెలిపారు.

ఆఫ్రికా దేశంలోని నైజర్‌‌‌‌లో ఓ పెట్రోల్ లారీ రైల్వే ట్రాక్ దాటుతుండగా బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు ప్రజలు గుమికూడారు. పెట్రోల్ తీసుకెళుతున్న సమయంలోనే ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పేట్రోల్ కోసం గుమికూడిన ప్రజలు మంటలకు అహూతయ్యారు. ట్యాంకర్ చుట్టు ఉన్నవాళ్లు అక్కడిక్కడే మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

Tanker truck explosion in Niger kills 55

కాగా మరి కొంతమందిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం పెద్ద ఎత్తున జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వారు తెలిపారు.కాగా ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న ఆస్థులకు పెద్ద నష్టం జరిగినట్టు తెలిపారు.

English summary
Fifty-five people were killed following by the explosion of a tanker truck carrying gasoline, a few hundred meters from the Niamey International Airport, a spokesman for the Ministry of Interior told AFP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X