దటీజ్ నరేంద్ర మోడీ!: ఇన్స్టాగ్రామ్లో చేరిన 2 గంటల్లో..
నయ్ ప్యీ తా: సామాజిక అనుసంధాన సైట్లలో మోడీ ఎప్పుడు అందుబాటులో ఉంటారనే విషయం తెలిసిందే. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా మోడీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ రెండింట మోడీకి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.
ఆన్లైన్లో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే సోషల్ మీడియా వెబ్ సైట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మోడీ యువతకు చేరువ కానున్నారు. మయన్మార్ ఏషియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మెడీ అక్కడ తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో అప్ లోడ్ చేశారు.
హలో వరల్డ్! ఇన్స్టాగ్రామ్లో చేరడం గొప్ప అనుభూతినిస్తోంది. నా తొలి ఫోటో.. ఏషియాన్ సదస్సు నుండి అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆయన ఖాతా తెరిచిన రెండు గంటల్లోపే దాదాపు 38వేల మంది ఫాలోవర్లు వచ్చారు. ఇన్స్టాగ్రామ్లో చేరినట్లు మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నరేంద్ర మోడీ
మయన్మార్ ఏషియాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన నరేంద్ర మెడీ అక్కడ తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో అప్ లోడ్ చేశారు.
నరేంద్ర మోడీ
ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రజలకు ఎప్పుడుఅందుబాటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో సాధారణ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత సెల్ఫీ తీసుకొని ట్విట్టర్లో ఉంచిన దృశ్యం.
నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏషియాన్ శిఖరాగ్ర సదస్సులో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్తో భేటీ అయిన దృశ్యాన్ని పీఎంవో ట్విట్టర్లో అప్ లోడ్ చేసింది.
నరేంద్ర మోడీ
ఏషియాన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాడు హాజరైన దృశ్యం. ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు.