వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబులు వేసి 12 మంది పోలీసులను చంపేశారు

|
Google Oneindia TeluguNews

అంకారా: గస్తి తిరుగుతున్న పోలీసుల వాహనంపై బాంబులతో దాడులు చెయ్యడంతో 12 మంది మరణించి నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన తూర్పు టర్కీలో జరిగింది. బాంబుల దాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

తూర్పు టర్కీ ప్రాంతంలో కుర్దిస్తాన్ వర్కర్స్ పార్గీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇగ్లిర్ ప్రాంతంలోని అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలో పోలీసులు మిని బస్ లో గస్తి తిరుగుతున్నారు అదే సందర్బంలో మిని బస్ మీద బాంబు దాడులు జరిగాయి.

 The 12 police were killed in Turkish

ఈ దాడిలో 12 మంది పోలీసులు మరణించారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురు దాడికి దిగారు. టర్కీ వాయు సేన బలగాలు రంగంలోకి దిగి కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి చెందిన 40 మంది తిరుగుబాటుదారులను అంతం చేశారని అధికారులు చెప్పారు.

కుర్దిస్తాన్ వర్సర్స్ పార్టీకి చెందిన తిరుగుబాటుదారులు పోలీసులు ప్రయాణిస్తున్న మిని బస్సు మీద బాంబులు వేశారని అధికారులు అన్నారు. మూడు రోజుల క్రితం మిలిటెంట్లు జరిపిన దాడిలో 16 మంది పోలీసులు అంతం అయిన విషయం తెలిసిందే.

English summary
The 12 police were killed in the eastern region of Igdir in a bomb attack by Kurdistan Workers' Party (PKK) militants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X