చైనా ఆర్థిక సాయంతో పాకిస్తాన్లో పట్టాలెక్కిన తొలి మెట్రో రైలు - Newsreel
పాకిస్తాన్లో తొలి మెట్రో లైన్ అందుబాటులోకి వచ్చింది.
పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్లో దేశంలో తొలి మెట్రో లైన్పై రాకపోకలు ప్రారంభమయ్యాయి.
27 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో ఆరంజ్ లైన్లో దాదాపు 25 స్టేషన్లు ఉన్నాయి.
జనాభా ఎక్కువగా ఉండే లాహోర్ నగరంలో దీనివల్ల ఎక్కడికి వెళ్లాలన్నా రాకపోకలు సులభం కానున్నాయి.
పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించిన ఈ మెట్రో పూర్తిగా అందుబాటులోకి వస్తే రోజూ దాదాపు 2.50 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా.
ఈ ప్రాజెక్టును 300 బిలియన్ల రూపాయలతో నిర్మించారు. దీన్ని పూర్తి చేయడానికి చాలా ఏళ్లు పట్టింది.
చైనా తన వన్ బెల్ట్ అండ్ వన్ రోడ్ ప్రాజెక్ట్ కింద పాకిస్తాన్కు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వాటితోనే ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించారు.
ఈ మెట్రో లైన్ నిర్మాణంపై వ్యతిరేకత కూడా వచ్చింది. దీని కోసం 600కు పైగా చెట్లను కొట్టేశారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ పుట్టుకపై కట్టుకథలు ఆపండి... డబ్యూహెచ్ఓ హెచ్చరిక
- కరోనావైరస్: గబ్బిలాలు ఈ వైరస్ను వ్యాప్తి చేస్తాయా? శాస్త్రీయ సమాధానం ఇదీ
- ఈ రాకాసి గబ్బిలాలు రక్తం జుర్రుకుంటూ ముద్దులు పెట్టుకుంటాయ్
- కరోనావైరస్ తమలోనే ఉన్నా గబ్బిలాలు జబ్బు పడవెందుకు? రహస్యం శోధిస్తున్న శాస్త్రవేత్తలు
- బ్లాక్ మార్కెట్లో ప్లాస్మా.. ఒక్కో యూనిట్ ధర రూ. 25,000 పైనే
- ఉమ్ము పరీక్షలతో కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)