వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్ లో సెంచరీ చేసిన వృద్దులు 60 వేలు

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ దేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దుల సంఖ్య అక్షరాల 60 వేలు దాటింది. ఈ సందర్బంగా జపాన్ లో పెద్ద పండుగ చెయ్యడానికి జపాన్ దేశస్తులు సిద్దం అవుతున్నారు. అందరిని సన్మానించి, ప్రశంసాపత్రాలు, బహుమానాలు ఇవ్వాలని నిర్ణయించారు.

జపాన్ దేశంలో 2015లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దుల సంఖ్య ఎంత అని ప్రభుత్వం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అధికారుల దిమ్మతిరిగే వివరాలు బయటకు వచ్చాయి. జపాన్ దేశంలో 60 వేల మందికి పైగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దులు ఉన్నారని గుర్తించారు.

The number of people aged 100 and above has hit 60,000 in Japan

వీరి కోసం సెప్టెంబర్ 15వ తేదిన ‘సెంచరీ మార్కర్స్ సీనియర్స్ డే 'గా జపాన్ ప్రకటించింది. ఆ రోజు 7,000 యన్ (జపాన్ కరెన్సీ)ల విలువైన వెండి గిన్నెలను 30,379 మంది వృద్దులకు బహుమానంగా అందిస్తున్నారు. 1963 లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న 153 మంది వృద్దులకు వెండి గిన్నెలు బహుమతిగా ఇచ్చారు.

అప్పటి నుంచి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్దులకు వెండి గిన్నెలు బహుమానంగా అందిస్తున్నారు. 2014లో 30,000 మంది వృద్దులకు వెండి గిన్నెలు బహుమతిగా అందించారు. ఇప్పుడు ఆ సంఖ్య 30,379కి చేరింది. ఈ 60వేల మందిలో 87 శాతం మంది బామ్మలే ఉన్నారు.

English summary
On Sept 15, when the country marks “Senior’s Day”, the government will give letters and commemorative gifts to the 30,379 people who turn 100 this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X