ఉగ్రవాద దంపతులు కలుసుకుంది మక్కాలో
వాషింగ్టన్: ఉగ్రవాద దంపతులు కలిసింది ఎక్కడ అనే విషయం అధికారులు గుర్తించారు. ఆన్ లైన్ ద్వారా పరిచయం అయిన సయ్యద్ ఫరూక్, తప్పీన్ మాలిక్ సౌదీ అరేబియాలోని ముస్లీంల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన మక్కాలో కలిశారని అమెరికా అధికారులు గుర్తించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సయ్యద్ ఫరూక్, తప్పీన్ మాలిక్ దంపతులు కాల్పులు జరిపి 14 మంది అమాయకులను హత్య చేశారు. భద్రతా దళాలు జరిపిన కాల్పులలో దంపతులు ఇద్దరూ అంతం అయ్యారు.
ఈ కేసు దర్యాప్తు చేసిన అధికారులు వీరి వీసాల వివరాలు సేకరించారు. ఇద్దరూ మక్కాలో కలుసుకున్నారని వీరి వీసాలను పరిశీలించిన న్యాయ విచారణ కమిటీ గుర్తించింది. 2013లో ఉగ్రవాద కుటుంబ సభ్యులు మక్కా వెళ్లారు.
అక్కడే ఇరు కుటుంబ సభ్యులు ఫరూక్, తప్పీన్ మాలిక్ పెళ్లి విషయం మాట్లాడుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. కాలిఫోర్నియాలో ఫరూక్ ఉద్యోగంలో చేరిన తరువాత ఇద్దరూ వివాహం చేసుకున్నారని అధికారులు తెలిపారు.