వేలంలో రూ. 23 లక్షలు పలికిన చేప... రికార్డు
టోక్యో: సముద్ర చేపల్లో అత్యంత రుచికరంగా ఉండే చేపగా టునా చేపకు పేరు ప్రఖ్యాతులున్నాయి. దీంతో దీని ఖరీదు కూడా ఎక్కువే. ఈ చేప మాంసం కిలో ధర వేలల్లో పలుకుతుంది. జపాన్లో ఈ చేపలను వేలం వేస్తారు. అందుకు కారణం తక్కువ సంఖ్యలో ఈ చేపలు లభ్యమవడమే.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
జపాన్ రాజధాని టోక్యోలోని చేపల మార్కెట్లో సోమవారం నాడు టునా చేపలను వేలం వేయగా ఓ చేప రూ. 23 లక్షల ధర పలికింది. సుకిజి ఫిష్ మార్కెట్లో న్యూ ఇయర్ సందర్భంగా వేసిన వేలంలో 180 కిలోల బరువున్న ఈ టునా చేపను సుషి రెస్టారెంట్ల యజమాని కియోషి కిముర దక్కించుకున్నారు.
వరుసగా నాల్గవ ఏడాది ఈ టునా చేపను దక్కించుకోవడం విశేషం. సోమవారం ఉదయం పూట వేసిన వేలంలో కొన్ని వందల సంఖ్యలో టునా చేపలను అక్కడి స్ధానికులు కొనుగోలు చేశారు. టునా చేపల దేహంలో ఫ్లోటింగ్ బ్లాడర్ నిర్మాణం ఉండదు.
అందుకే అవి నీటిలో తేలలేవు. ఎప్పుడూ సముద్ర జలాల్లో ఈదుతూనే ఉండాలి. ఈదడం ఆపివేశాయంటే నీటి అడుగు భాగానికి పడిపోతాయి.