పట్టాలు తప్పిన రైలు.. 50 మంది మృతి .. ఎక్కడో తెలుసా ..?
కిన్షాసా : రైలు పట్టాలు తప్పడంతో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ప్రాథమిక అంచనాలను బట్టే తెలుస్తోందని .. వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
కాంగోలోనే డీఆర్ కాంగోలో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీంతో 50 మంది మృతిచెందారని కాంగో మంత్రి స్టీవ్ ఎం బికాయి పేర్కొన్నారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు సమయంలో ప్రమాదం జరిగింది. ఆగ్నేయా టాంగాన్యికా ప్రావిన్స్లోని మయిబరిడి టౌన్లో ప్రమాదం జరిగింది.
ప్రాథమిక అంచనాలను బట్టి మృతుల సంఖ్య 50 మంది అని .. ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రైలు పట్టాలు తప్పేందుకు గల కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.