వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రక్ బాంబు పేలుడు: 60 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

బాగ్దాద్: రద్దిగా ఉన్న మార్కెట్ లో ట్రక్ బాంబు పేలిపోవడంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 60 మంది మరణించారు. ఈ బాంబు పేలుడుతో 200 మందికి పైగా తీవ్రగాయాలై ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసులు, వైద్యులు తెలిపారు.

ఇకార్ రాజధాని బాగ్దాద్ నగరంలో గురువారం ఉదయం ఈ బాంబు పేలుడు జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు. సరద్ ప్రాంతంలోని మార్కెట్ లో ఉదయం పూట నిత్యం రద్దిగా ఉంటుంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం వ్యాపారులు, కొనుగోలుదారులు మార్కెట్ దగ్గరకు వెళ్లారు.

Truck bomb kills at least 60 people in Baghdad

మార్కెట్ కిటకిటలాడుతుంది. అదే సమయంలో ఒక ట్రక్ తీసుకు వచ్చిన ఉగ్రవాది అక్కడ పార్క్ చేశాడు. ఒక్క సారిగా ట్రక్ బాంబు పేలిపోయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. బాంబు పేలుడుకు పలువురి శరీరాల నుండి అవయవాలు తెగి గాలిలో ఎగిరిపడ్డాయి.

అమాయకుల కాళ్లు, చేతులు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తలించారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A truck bomb ripped through a market in a Shiite-majority area of north Baghdad on Thursday, killing at least 60 people, security and medical officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X