వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రక్కు బీభత్సం: 12మంది మృతి, 50మందికి గాయాలు
జర్మనీ రాజధాని బెర్లిన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా షాపింగ్ చేసుకుందామని మార్కెట్కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా షాపింగ్ చేసుకుందామని మార్కెట్కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.
మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్లోని కైసెర్ విల్హెమ్ మెమోరియల్ చర్చికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తుండంతో మార్కెట్ అంతా పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
English summary
At least 12 persons were killed after a truck rammed into a crowded Christmas market in Central Berlin on Monday evening. Several others were injured.