చైనాతో భారత్కు సరిహద్దు లేదట: షాక్లో మోడీ, డొనాల్డ్ ట్రంప్ పరిజ్ఞానం ఈపాటిదేనట!
వాషింగ్టన్: భారత్-చైనా సరిహద్దులను పంచుకుంటాయనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తెలియదట. ఈ విషయాన్ని తాజాగా వెలువడిన ఓ పుస్తకం వెల్లడించింది. వాషింగ్టన్ పోస్ట్కు చెందిన ఇద్దరు పాత్రికేయులు ఫిలిప్ రుకర్, కరోల్ లియోనిగ్ రాస్తున్న పుస్తకం 'ఏ వెరీ స్టేబుల్ జీనియస్'లో ఈ మేరకు పేర్కొన్నారు.
చైనాతో భారత్ సరిహద్దు లేదంటూ ట్రంప్..
భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. మోడీతో ట్రంప్ సమావేశం సందర్భంగా చైనా.. భారత్తో సరిహద్దును పంచుకోవడం లేదు అన్నారు.
ట్రంప్ మాటకు మోడీ షాక్..
ట్రంప్ చెప్పిన మాట విని మోడీ ఆశ్చర్యపోయారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేగాక, ట్రంప్ ఏ మాత్రం సీరియస్గా ఉన్నట్లు కనిపించడం లేదని మోడీ ట్రంప్ సహాయకుడితో వ్యాఖ్యానించినట్లు పుస్తంలో రాసుకొచ్చారు. భేటీ తర్వాత అమెరికాతో దౌత్య సంబంధాలలో భారత్ ఒక అడుగు వెనుకకు వేసిందని పేర్కొన్నారు. పంచంలో జరిగిన కొన్ని చారిత్రాత్మక సంఘటనల గురించి డొనాల్డ్ ట్రంప్కు ఏ మాత్రం అవగాహన లేదని ఈ పుస్తకంలో వెల్లడించారు.
మోడీకి హార్బర్ దాడి గురించి కూడా తెలియదు..
1941 డిసెంబర్లో జపాన్ పెరల్ హార్బర్పై దాడి చేసిన ఘటన గురించి కూడా ట్రంప్కు ఏమీ తెలియదని పేర్కొన్నారు. సదరు పుస్తకంలోని ఈ పరిణామాలను వాషింగ్టన్ పోస్టు బుధవారం ప్రచురించింది. భారత్-చైనా మధ్య 3,488 కి.మీ పొడవైన సరిహద్దు ఉందని, ఇందులో పలు ప్రాంతాల్లో భూభాగం విషయమై ఉభయ దేశాల మధ్య దశాబ్ధాలుగా పరిష్కారం కాని వివాదమున్నదని పేర్కొంది. కాగా, ట్రంప్ పాలనపై, రష్యాపై చేసిన రచనలకు గానూ 2018లో ఈ రచయితలిద్దరికీ పులిట్జర్ బహుబతి లభించింది.
తెలివైనవాడినంటూ.. ప్రసంగాల్లో దోషాలు..
ప్రపంచంలో జరిగిన చాలా విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తాను చాలా తెలివైన వ్యక్తిగా ట్రంప్ పలుమార్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే, చాలాసార్లు ఆయన జ్ఞానం ఏ పాటిదో ప్రపంచానికి తెలియజేశారు. ఓ సందర్భంలో నేపాల్, భూటాన్ భారత్లోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దేశాల పేర్లను కూడా ఆయన సరిగా పలకలేకపోవడం గమనార్హం. నేపాల్ దేశాన్ని నిపుల్ అని, భూటాన్ దేశాన్ని బటన్ అని పలికి ట్రంప్ తన అవగాహన ఏ పాటిదో చాటుకున్నారు.