ఇండియాకి ట్రంప్ ఇచ్చిన ట్యాగ్ లైన్..!
కాంట్రవర్సీలు మాట్లాడ్డం.. పాపులారిటీని, పబ్లిసిటీని పెంచుకోవడానికి ఓ ట్రిక్కుగా మారిపోయింది. ఇండియాలో ఈ విషయంలో ఆరితేరిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అయితే, అమెరికా తరుపున ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ పేరే వినిపిస్తుంది. ఆ వివాదస్పద వ్యాఖ్యలతోనే నిత్యం వార్తల్లో చోటు సంపాదిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడే కొద్ది ట్రంప్ వ్యాఖ్యల్లో మరింత పదును పెరుగుతుందే తప్పితే తగ్గట్లేదు.
నిన్నటికి నిన్న చైనా వాణిజ్య పోకడలపై స్పందిస్తూ.. నేనున్నంత వరకు అమెరికాను చైనా రేప్ చేయలేదని సంచలన కామెంట్స్ చేసిన ట్రంప్ తాజాగా మళ్లీ ఇండియాపైనే మాటలు ఎక్కుపెట్టారు. భారత్, చైనా, వియత్నాం లాంటి దేశాల వల్లే అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించిన ట్రంప్.. భారత్ ను పేలడానికి సిద్ధంగా ఉన్న గన్ గా అభివర్ణించారు.
ఆయా దేశాలపై ఎలాంటి కోపం లేదని చెప్తూనే ట్రంప్ తన నోటికి పని చెప్తున్నారు. నిన్న చైనా విషయంలోను నేడు భారత్ విషయంలోను ట్రంప్ ఇదే తరహాలో వ్యవహరించారు. ఓ వైపు భారత్ పై ఎలాంటి కోపం లేదని అభిప్రాయపడుతూనే.. భారత్ ను ఓ హాట్ గన్ గా పేర్కొనడం ట్రంప్ నోటి దురదేనని అభిప్రాయపడుతున్నారు పలువురు.