కశ్మీర్ లేని భారత్..?: ఇండియా బిడెన్ వైపట, పాకిస్తాన్లో కశ్మీర్.. రిపబ్లికన్లకు మద్దతు: జూనియర్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోన్న సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎన్నికల్లో తిరిగి రిపబ్లికన్ పార్టీ అధికారం చేపడుతోందని చెప్పారు. ఇందుకోసం ప్రపంచ పటం చూపారు. అందులో మొత్తం ఎరుపు రంగును నింపారు. ఇదీ రిపబ్లికన్ పార్టీ గుర్తు అని తెలిసిందే. అయితే కొన్నిదేశాలను మాత్రం మినహాయించారు. అందులో భారతదేశం కూడా ఉన్నది. అయితే ఇండియాలో కశ్మీర్ లేకుండా చూపడం కాంట్రవర్సీకి దారితీసింది.
దాదాపు ప్రపంచ దేశాలు అన్నీ రిపబ్లికన్ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నాయని ట్వీట్ చేశారు. అయితే ఇండియా మాత్రం బ్లూ రంగులో నింపారు. అంటే భారత్.. డెమోక్రటిక్ అభ్యర్థి బిడెన్కు మద్దతిస్తోందని చెప్పారు. అయితే అందులో జమ్ము కశ్మీర్ తీసేసి మరీ చూపించారు. కశ్మీర్ పాకిస్తాన్లో కలిపి.. రిపబ్లికన్లకు మద్దతునిస్తోందని చూపడం అగ్గిరాజేసింది.
Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020
అంతేకాదు ఎన్నికలకు సంబంధించి అంచనాలు కొలిక్కి వచ్చాయని తెలిపారు. అయితే నీలిరంగులో ఇండియాతోపాటు చైనా, మెక్సికో, క్యూబా, లిబియా, కెనాడలోని కొన్ని దేశాలు ఉన్నాయి. మిగతా దేశాలు అన్ని రిపబ్లికన్లకు మద్దతు ఇస్తున్నాయని ట్వీట్ చేశారు.