వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెజాన్ ప్రాంతంలో విషాదం: 2పడవల మునక, 43 మంది మృతి
బ్రెజిల్లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 43 మంది మృతి చెందారు. పారా రాష్ట్రంలోని జింగూ నదిలో పడవ మునిగి 21 మంది మృత్యువాత పడ్డారు.బాహియా రాష్ట్రంలో జరిగిన మ
బెర్లిన్: బ్రెజిల్లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు పడవ ప్రమాదాల్లో 43 మంది మృతి చెందారు. పారా రాష్ట్రంలోని జింగూ నదిలో పడవ మునిగి 21 మంది మృత్యువాత పడ్డారు.
బాహియా రాష్ట్రంలో జరిగిన మరో ప్రమాదంలో 22 మంది మృతి చెందినట్లు బ్రెజిల్ నౌకాదళం ప్రకటించింది. గల్లంతైన వారికోసం అత్యవసర దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ ప్రమాదాల్లో 21మందిని రెస్య్కూ బృందం కాపాడింది. రెండు రాష్ట్రాల్లో తుపాను పరిస్థితుల కారణంగా ఈ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
English summary
Two Brazilian ferry wrecks in as many days left at least 43 people dead, authorities said on Thursday (Aug 24), as rescuers searched for several more who were still missing.
Story first published: Friday, August 25, 2017, 15:53 [IST]