వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్ట్ రెండు గ్లాసులు నీళ్లతో ఎంత బెనిఫిట్ ఉందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

లండన్ : అధిక బరువుతో బాధపడేవారికి నిజంగా ఇదొక మంచి చిట్కా. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీటిని తాగడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు. భోజనానికి ముందు.. రెండు గ్లాసులు నీరు తాగడం ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటారని, తద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ బరువును తగ్గించుకునే అవకాశముంటుందని పరిశోధకులు వెల్లడించారు.

ఈ ప్రక్రియను ప్రతీరోజు క్రమం తప్పకుండా పాటించినట్లైతే.. మూడు నెలల్లోగా 4 కిలోల బరువు తగ్గవచ్చునని అధ్యయనంలో తేలినట్లు లండన్ ఒబెసిటీ జర్నల్ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ సింపుల్ చిట్కా ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండానే అధిక బరువును తగ్గించుకోవచ్చునని పరిశోధకులు అంటున్నారు.

Two glasses of water before each meal could help in weight reduction, researchers say

ఇకపోతే ప్రస్తుతం 5-17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 268మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశముందని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. వీరిలో 98మిలియన్ల మంది స్థూలకాయం బారినపడే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. 2014 లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 18ఏళ్లు పైబడ్డ వారిలో 1.9బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులేనని ఒబెసిటీ జర్నల్ ద్వారా వెల్లడయింది.

English summary
Researchers from the University of Birmingham have shown that drinking 500ml of water at half an hour before eating main meals may help obese adults to lose weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X