బాధ పెట్టడం ఎందుకని.. ఒకేసారి ఇద్దరు ప్రియురాళ్లను పెళ్లాడాడు!
జకార్తా: ఆ యువకుడు ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఇతడ్ని చాలా ఇష్టపడుతున్నారు. ప్రేమించుకోవడం అయిపోయింది.. ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, ఒకరిని చేసుకుంటే.. మరొకరికి కోపం వస్తుందని అనుకున్న ఆ యువకుడు ఒకేసారి ఇద్దరినీ పెళ్లి చేసుకుని సమస్యకు పరిష్కారం చూపించుకున్నాడు.
భారీగా కట్నం ఇచ్చుకుని..
ఈ వింత ఘటన ఆగస్టు 17న ఇండోనేషియాలోని కలిమంతన్ ఎయిర్తరప్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పేరు తెలియని ఆ వరుడు తాను వివాహం చేసుకునే ఇద్దరు అమ్మాయిల కుటుంబసభ్యులకు భారీగా కట్నం ఇచ్చుకున్నాడు. ఇండోనేషియా సాంప్రదాయంలో వరుడే వధువుకు కట్నం ఇవ్వాల్సి ఉంటుంది.
ఫొటోలకు ఫోజులిచ్చారు..
ఇద్దరు అమ్మాయిల మధ్య ఆ యువకుడు కొంత ఆందోళనగా కనిపించినా పెళ్లి సంబరం సజావుగా సాగడంతో ఊపిరిపీల్చుకున్నాడు. అతడ్ని వివాహం చేసుకున్న అమ్మాయిలు కూడా.. అతనికి చెరోవైపు ఉండి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం.
ఎవర్నీ బాధపెట్టకూడదని ఇద్దర్నీ..
తాను
ప్రేమించిన
ఇద్దరు
అమ్మాయిల్లో
ఎవర్నీ
బాధపెట్టకూడదనే
ఆ
యువకుడు..
ఆ
ఇద్దరు
అమ్మాయిలను
వివాహం
చేసుకున్నట్లు
స్థానిక
మీడియా
తన
కథనాల్లో
వెల్లడించింది.
అమ్మాయిల
కుటుంబసభ్యులు
కూడా
ఈ
వివాహాన్ని
స్వాగతించడం
గమనార్హం.
సాంప్రదాయబద్దంగా పెళ్లిళ్లు..
మూడు కుటుంబాలవారు సానుకూలంగా ఉండటంతో సాంప్రదాయబద్దంగా ఈ పెళ్లిళ్లు జరిగాయి. మూడు కుటుంబాల సభ్యులంతా కలిసి నవ వరుడు, వధువులను ఆశీర్వదించారు. మత పురోహితులు వారి ఆచారం ప్రకారం ఘనంగా వివాహాలు జరిపించారు.