వెంకటేశుని భక్తి... ప్రతి సంవత్సరం రూ 14 కోట్లను కానుకగా ఇచ్చిన విదేశీ భక్తుడు...!
భక్తుల కోరికలు తీర్చే తిరుమల వెంకన్న శ్రావణ శుక్రవారం నాడు ఓ విదేశీ భక్తుడు భారీ మొత్తంల కానుకల్ని అందించారు. అది కూడ రెండు సంవత్సరాలుగా కోట్లాది రూపాయాలను దేవుడికి అందిస్తున్నాడు. ప్రత్యేక పూజలు చేసి పద్నాలుగు కోట్ల రుపాయాలను కానుగా అందించి తన భక్తిని చాటుకున్నాడు.
శ్రావణ శుక్రవారం కావడంతో దేశంలోని గుళ్లు గోపురాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అమేరికాకు చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు రూ 14 కోట్లను కానుకగా తిరుమల తిరుపతి దేవాలయ అధికారులకు అందించారు. కాగా వీదేశాలకు చెందిన ఇద్దరు స్నేహితులు గత సంవత్సరం కూడ పదమూడున్నర కోట్ల రుపాయాలు కానుకుగా అందించినట్టు అధికారులు తెలిపారు.
నేడు శ్రావణ శుక్రవారం కావడంతో ఇద్దరు స్నేహితులు కూడ వారి కుటుంభ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ 14 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ను టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డికి అందించారు. కాగా కానుకగా అందించిన మొత్తన్ని భక్తుల సేవ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని ఆలయ అధికారులను కోరినట్టు తెలిపారు.