ఇద్దరు పోలీసు అధికారుల హత్య
కరాచీ: గస్తి తిరుగుతున్న పోలీసు అధికారులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపి తప్పించుకుని పరారైన సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. పాకిస్థాన్ బెలూచిస్థాన్ ఫ్రావిన్స్ లోని క్వెట్టా నగరంలో పోలీసులు గస్తి తిరుగుతున్నారు.
అక్కడ ఉన్న పోలీసులపై కాల్పులు జరపడంతో ఒకరు సంఘటనా స్థలంలో, ఇంకోకరు ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. క్వట్టా లోని శాటిలైట్ సిటిలో సోమవారం రాత్రి ఇఫ్తార్ విందు ఎర్పాటు చేసిన ప్రాంతంలో పోలీసులు గస్తి తిరుగుతున్నారు.
ఆ సందర్బంలో బైక్పై వెళ్తూ ఇద్దరు నిందితులు పోలీసుల మీద తూటాల వర్షం కురిపించారు. ఆ సమయంలో ఎస్ఐ రెహమాన్ అక్కడికక్కడే మరణించాడు. మరో ఎస్ఐ హఫీజుల్లా అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై హఫీజుల్లా మరణించాడు.
పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. ఇటివల ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో 8 మంది పోలీసులు మరణించారు. అయితే దాడులకు పాల్పడింది తామే అని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.