వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ ఇండోనేషియాలో భూకంపాలు, ప్రకంపనాలతో జనం పరుగులు, 6.8, 6.9 తీవ్రతతో...

|
Google Oneindia TeluguNews

పశ్చిమ ఇండోనేషియాలో రెండు శక్తిమంతమైన భూకంపాలు సంభవించాయి. సముద్రగర్భంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. భూ ప్రకంపనాలతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత మాత్రం 6.8గా నమోదైంది. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం ప్రభావం చూపించింది.

Two Powerful Earthquakes Shake Western Indonesia..

బెంగ్‌కులు నగరంలో పశ్చిమ నైరుతి దిశలో 144.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమత్రా ద్వీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆరు నిమిషాల తర్వాత ఆ ప్రాంత సమీపంలో 6.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. కానీ సునామీ హెచ్చరికలు ఏమీ జారీచేయలేదు అని అధికారులు తెలిపారు. ఉదయం భూమి పదే పదే కంపించిందని స్థానికుడు ఒకరు ట్వీట్ చేశారు. దీంతో తాము ఇంటి నుంచి బయటకు వెళ్లామని పేర్కొన్నారు. 270 మిలియన్ల జనాభా ఉన్న ద్వీపం ఇండోనేషియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు వస్తుంటాయి. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తుంటారు.

English summary
Two powerful and shallow undersea earthquakes shook western Indonesia on Wednesday, causing panic but no immediate reports of casualties or damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X