ట్రావెల్ బ్యాన్: ఉత్తరకొరియాకు వెళ్ళకూడదని అమెరికా నిర్ణయం
తమ దేశ పౌరులను ఇక ఉత్తర కొరియాకు వెళ్ళనివ్వకూడదని అమెరికా నిర్ణయం తీసుకొంది. ఉత్తరకొరియా విధించిన జైలు శిక్ష కారణంగా తమ దేశ పర్యాటకు ఒట్టో వాంబియర్ మృతి చెందిన నూపథ్యంలో మరికొద్ది వారాల్లోనే తమ దేశపౌర
వాషింగ్టన్:తమ దేశ పౌరులను ఇక ఉత్తర కొరియాకు వెళ్ళనివ్వకూడదని అమెరికా నిర్ణయం తీసుకొంది. ఉత్తరకొరియా విధించిన జైలు శిక్ష కారణంగా తమ దేశ పర్యాటకు ఒట్టో వాంబియర్ మృతి చెందిన నూపథ్యంలో మరికొద్ది వారాల్లోనే తమ దేశపౌరులెవరిని కూడ ఉత్తరకొరియాకు వెళ్ళకుండా అడ్డుకొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
చైనాకు చెందిన ఓ ట్రావెల్ సంస్థ కొరియాకు చెందిన ట్రావెల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించాయి.ఈ నెల 27 నుండి ఈ బ్యాన్ను అమెరికా అమలు చేయనుందని అధికారులు ప్రకటించారు.
దీని ప్రకారంగా ఉత్తరకొరియాకు వెళ్ళిన, వెళ్తున్న అమెరికా వారి పాస్పోర్ట్లను 30 రోజుల వరకే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత వాటిని రద్దు చేస్తోందని ఆ సంస్థలు వెల్లడించాయి. అమెరికా ప్రభుత్వం నుండి తమకు ఇప్పుడే సమాచారం అందిందంటున్నారు అధికారులు.
అమెరికా పౌరులను ఇక ఎంతో కాలం ఉత్తర కొరియా వెళ్ళేందుకు అనుమతించడం కుదరదు. అలా వెళ్ళిన వారి పాస్పోర్ట్లు 30 రోజుల తర్వాత విలువలేనివిగా మారిపోతాయని చైనాకు చెందిన ట్రావెలింగ్ సంస్థ యంగ్ పయనీర్ టూర్స్ తెలిపింది. అమెరికాకు చెందిన ఏ విభాగం ఈ ప్రకటన చేసిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.