యూకే ఇండియా వీక్ 2018: ప్రారంభమైన లీడర్షిప్ కాన్క్లేవ్
లండన్: 5వ వార్షిక యూకే ఇండియా లీడర్షిప్ కాన్క్లేవ్ జూన్ 20, 21వ తేదీలలో జరుగుతోంది. ఈ కార్యక్రమం బకింగ్హామ్షైర్లోని డి వేరే లాటిమెర్ ఎస్టేట్లో బుధవారం ప్రారంభమైంది. భారత్ యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఈ లీడర్షిప్ కాన్క్లేవ్ దోహదపడుతుందని, ఇదో ల్యాండ్మార్క్ అని చెబుతున్నారు.
యూకే ఇండియా వీక్ 2018లో ప్రసంగించనున్న ప్రముఖులు ఉమాంగ్ బేడీ (డెైలీ హంట్), చంద్రజిత్ బెనర్జీ (డైరెక్టర్ జనరల్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), విజయ్ చౌతాయివాలే (ఇంచార్జ్-ఫారెన్ అపైర్స్ భారతీయ జనతా పార్టీ), పీయూష్ గోయల్ (మినిస్టర్ ఫర్ ఫైనాన్స్, రైల్వేస్, కోల్), డాక్టర్ స్పపన్ దాస్గుప్తా (మెంబర్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్), మోహిత్ జోషి (ప్రెసిడెంట్ ఇన్ఫోసిస్), డాక్టర్ రాజీవ్ కుమార్ (వైస్ చైర్మన్ నీతి ఆయోగ్), రాకేష్ భారతి మిట్టల్ (ప్రెసిడెంట్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ).