యూకే-ఇండియా వీక్ 2018-ప్రాంతీయ భాషల్లో హృదయాల్లోకి వెళ్తుంది: డైలీహంట్ ఉమాంగ్ బేడీ
యూకే-ఇండియా లీడర్షిప్ వార్షికోత్సవ సమావేశంలో డైలీహంట్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ ప్రసంగించారు. అంతకుముందు, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ మాట్లాడారు.
ఉమాంగ్ బేడీ మాట్లాడుతూ.. 200 మిలియన్ల ప్రజలు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను వినియోగిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీలోని అవరోధాలు కూడా కంటెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు.
భారత దేశంలో 2020 కల్లా ప్రాంతీయ భాషల్లో మరింత వినియోగం పెరుగుతుందని చెప్పారు. మనం వారి ప్రాంతీయ భాషలలో మాట్లాడితే లేదా కంటెంట్ ఇస్తే అది వారి హృదయాల్లోకి వెళ్తుందని చెప్పారు. ప్రజల అటెన్షన్ కోసం కంటెంట్ తగ్గుతూ వస్తోందన్నారు. వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ... బాలీవుడ్లో తన స్ట్రగుల్ను గుర్తు చేసుకున్నారు.
‘Content is getting shorter and shorter to catch people’s attention. What we need is a level playing field for an alternate Indian content platform’ @umang_bedi on the future of Indian Media @ UKIndia Conclave #UKIndiaWeek2018 pic.twitter.com/2gh9KCrwbz
— India Inc. (@IndiaIncorp) June 20, 2018
అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడారు. భారత ప్రభుత్వం గత నాలుగేళ్లలో అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపేందుకు ఈ నాలుగేళ్లలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు.
‘By 2020, consumers will explode in India — if you speak to them in their language, it will go to their heart’ @umang_bedi of @DailyhuntApp gives his take @CarnivalCine Future of Creativity & Media panel @ UKIndia Conclave #UKindiaWeek2018 pic.twitter.com/Iy5doEZg1y
— India Inc. (@IndiaIncorp) June 20, 2018
మీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ తరపున తాను పెట్టుబడిదారులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వ విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతోందని చెప్పారు. ప్రభుత్వంలో ఏమైన తప్పులుంటే చెప్పాలని.. వాటిని సరిచేసుకుంటామని తెలిపారు. పెట్టుబడుల కోసం ప్రధాని మోడీ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.