అమెరికాలోని మిస్సిస్సిప్పిలో కాల్పులు, 8 మంది మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిస్సిస్సిప్పి: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు మిసిసిపి బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ అధికార ప్రతినిధి వారెన్ స్ట్రైన్ వెల్లడించారు. మిసిసిపి రాజధాని నగరమైన జాక్సన్కు 109 కి.మీ. దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రూరల్ లింక్లన్ కౌంటీ ప్రాంతంలోని బ్రూక్హెవెన్లో రెండు ఇళ్లు, బోగ్చిట్టోలోని మరో ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో రూరల్ లింక్లన్ కౌంటీ ఉన్నతాధికారి (డిప్యూటీ షెరిఫ్స్) సహా 8మంది చనిపోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని 35 ఏళ్ల ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై మిస్సిస్సిప్పి గవర్నర్ విచారం వ్యక్తం చేశారు.